తన యూజర్లను పెంచేకునేందుకు ఎయిర్ టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని తన కస్టమర్లకు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను డెలివరీ చేసేందుకు బ్లింకిట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశంలోని 16 నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండగా తాజాగా హైదరాబాద్లోనూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. రూ.49 కన్వీనియన్స్ ఫీజుతో 10 నిమిషాల్లో సిమ్ కార్డులను ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.