అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న బెన్ డెకెట్ 25 పరుగులకు ఔట్ అయ్యారు. ఆకాశ్ దీప్ వేసిన 4.3 ఓవర్లో క్లీన్బౌల్డ్గా బెన్ డకెట్ వెనుదిరిగారు. దీంతో 5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 31/2గా ఉంది. క్రీజులో జో రూట్ 1, ఓలీ పోప్ 4 పరుగులతో ఉన్నారు.