TG: హైదరాబాద్లోని కూకట్ పల్లి, చందానగర్, హఫీజ్పేట్, తదితర ప్రాంతాల్లో 48 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. 6, 7 తేదీల్లో తాగునీటి సరఫరా ఉండదన్న HMWSSB అధికారులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కలబ్గూర్-లింగంపల్లి స్ట్రెచ్లో పైప్లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. 8వ తేదీ ఉదయం 6 గంటలకు తిరిగి తాగునీటి సరఫరా పునరుద్ధరణ అవుతుందని చెప్పారు.