ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ దళిత బాలుడిని దొంగతనం చేశాడంటూ గ్రామస్తులు ఘోరంగా కొట్టారు. ఆపై గొంతు కోసి చంపేందుకు యత్నించారు. చివరికి బాలుడు గ్రామస్థుల చెర నుంచి బయటపడి తల్లి చెంతకు చేరాడు. జరిగిన విషయాన్నీ తల్లికి చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.