దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి చవి చూశారు. ఈ నేపథ్యంలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ స్పందించారు. ఆమె ‘ఎక్స్’ వేదికగా కౌరవ మహాసభలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.