అహ్మదాబాద్లోని మేఘానిలో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను ఆదేశించారు. అయితే విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది.