నెల్లూరు జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో కార్మికులు ఊపిరాడక పోవడంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.