అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఎయిర్ హోస్టెస్ కెరీర్ మనీషా థాపా కూడా ఉంది. అయితే మనీషా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని తన మామ ఓ మీడియాతో చెప్పుకొచ్చారు. ఎయిర్ హోస్టెస్ కావడమే మనీషా కల అని. దాని కోసం మొదట ఇండిగో ఎయిర్లైన్స్లో గ్రౌండ్ స్టాఫ్గా పనిచేసిందని, ప్రమాదానికి ముందు.. ఆమె లండన్, ఆస్ట్రేలియాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో ఎయిర్ హోస్టెస్గా పనిచేసిందని వెల్లడించారు. కానీ అంతలోనే అంత ముగిసిపోయిందని విలపించారు.