జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈఓ

69చూసినవారు
జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈఓ
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని టీటీడీ ఈఓ శ్యామలరావు ప్రకటించారు. 'నెయ్యిపై అనుమానంతో జులై 6న రెండు ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలింది. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టాం. వెంటనే ఏఆర్ డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశాం' అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్