టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశే మిగిలింది. 9 రోజుల వ్యవధిలోనే ఆయన రెండోసారి టైటిల్ చేజార్చుకున్నాడు. ముంబై టీ20 లీగ్లో మరాఠా రాయల్స్తో జరిగిన ఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఓటమిపాలైంది. కాగా జూన్ 3న జరిగిన ఐపీఎల్ ఫైనల్లోనూ అయ్యర్ కెప్టెన్సీ చేసిన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.