హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. 'BCCIతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. నిన్న స్కిల్స్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన బేగరికంచెలోనే దీన్ని నిర్మించేందుకు స్థలం ఇస్తామన్నాం. అద్భుతమైన స్టేడియం ఏర్పాటు చేయాలని కోరాం' అని అన్నారు. యూసుఫ్ గూడ, గచ్చిబౌలి, సరూర్నగర్, LB స్టేడియాల్లో క్రీడలు తగ్గి, రాజకీయ కార్యక్రమాలు పెరిగాయని చెప్పుకొచ్చారు.