ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటివరకు 8 మంది ఈ ఎన్కౌంటర్లో మృతి చెందగా వారిని స్వాధీనం చేసుకున్నారు. అయితే గంగలూరు అడవిలో తాజాగా మరో 12 మందిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.