ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో షాక్

63చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో షాక్
TG: సిమెంట్​ ధరల పెరుగుదల ప్రభావం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై పడనుంది. ఇప్పటికే స్థలం ఉండి ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు ప్రారంభించగా బస్తాపై రూ.30-50 వరకు పెరిగిన సిమెంట్​ ధరలపై ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఇంటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుండగా 600 చదరపు అడుగులలోపే నిర్మించుకోవాలి. ఇంటి నిర్మాణం పూర్తవ్వాలంటే దాదాపు 200లు బస్తాల సిమెంట్ అవసరం. ఆ లెక్కన రూ.10వేల వరకు అదనపు భారం పడే అవకాశముంది.

సంబంధిత పోస్ట్