వందేభారత్‌పై మరోసారి రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు

82చూసినవారు
వందేభారత్‌పై మరోసారి రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్‌ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో వందే భారత్ పై దాడి చేయడం ఇది నాలుగోసారి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్