పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి సవిత చెక్కును సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ కుటుంబానికి స్వయంగా అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. అలాగే, ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.