మస్కట్‌లో ఏపీ మహిళ ఆవేదన (వీడియో)

85చూసినవారు
కడప జిల్లాకు చెందిన నాగేశ్వరి అనే మహిళ ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లారు. ఓ ఇంట్లో పనికి చేరారు. అయితే వారు పనులు చేయించుకుంటున్నారని, కానీ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన బిడ్డ కోసం అప్పులు చేసి మస్కట్ వచ్చానని, తనను కాపాడాలని ఆమె కోరుతున్నారు. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్కట్ నుంచి తనను ఇంటికి తీసుకెళ్లండని, మంత్రి నారా లోకేష్ కాపాడాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్