అమెరికాలోని ఓ జలపాతంలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన యువ ఇంజనీర్ శనగన హరి కిరణ్ గౌడ్ (25) గల్లంతయ్యారు. ఇటీవల ఎంఎస్ పూర్తి చేసిన కిరణ్ అమెరికాలోనే ఉద్యోగంలో చేరినట్టు తల్లిదండ్రులు తెలిపారు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లిన హరికిరణ్ జలపాతంలో గల్లంతైనట్టు తెలిపారు. హరికిరణ్ తండ్రి రామకృష్ణ గౌడ్ చిక్కాల గ్రామంలో ప్రముఖ పీఎంపి డాక్టర్. ఆయనకు ఇద్దరు కుమారులు.