దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందో రాజస్థాన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన వెల్లడి చేస్తోంది. అక్కడ ప్యూన్ పోస్టుల కోసం 24.76 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేశారు. అందులో పీహెచ్డీ, ఎంబీఏ, ఎల్ఎల్బీ చదివినవారితో పాటు సివిల్స్కు సిద్ధమవుతున్నవారూ ఉన్నారు. మొత్తం 53,749 పోస్టులకు దరఖాస్తులు రావడం, ఒక్కో ఉద్యోగానికి 46 మంది పోటీ పడ్డారు.