వక్ఫ్బోర్డుతో ఎంత మందికి లాభం చేశారో రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ చర్చకు సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. 'భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఇకపై నాయకుల ఇళ్లలో కాదు.. కంప్యూటర్లో ఉంటాయి. హైదరాబాద్లో 70% వక్ఫ్ భూములను కాంగ్రెస్, ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరు' అని వ్యాఖ్యానించారు.