వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి
పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. నీటి నిల్వ గుంతలు, చెట్ల పొదలు మన ఇండ్ల చుట్టూ ఉండటం వల్ల పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. ఇక ఇవి ఉన్నచోటికి సర్వ సాధారణంగా పాములు వస్తుంటాయి. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ వర్షాల కారణంగా పెరిగిన మొక్కలను గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాలి.