బ్రిటీష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసులకు భయపడతారా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 'దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతుంది. కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వాతంత్య్ర ఉద్యమంలో నెహ్రూ తలొగ్గలేదు. మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా? కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టే వ్యవస్థ మారాలి' అని అభిప్రాయపడ్డారు.