SLBC టన్నెల్ ప్రమాద ఘటన జరిగి 50 రజులైనా తెలంగాణ సర్కారు సీరియస్గా తీసుకోవడం లేదని మాజీ మంత్రి హరిశ్రావు మండిపడ్డారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకొని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతున్నదని అన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరపాలి అని హరిశ్ డిమాండ్ చేశారు.