నేటి బిజీ లైఫ్లో చాలా మంది ఉదయం అల్పాహారాన్ని మానేస్తుంటారు. అయితే అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 'అల్పాహారం మానేస్తే, రక్తంలోని చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడి, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల డైలీ లైఫ్లో పనితీరు మందగించి, ఉత్సాహం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం గడిపితే జీవక్రియ తగ్గే ప్రమాదం ఉంటుంది.' అని హెచ్చరిస్తున్నారు