మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా షాపూర్లో హర్దౌల్ బాబా ఆలయంలో గోడ కూలడంతో 9 మంది పిల్లలు చనిపోయారు. ఈ ఘటన గురించి తెలిసి తనకు తీవ్ర ఆవేదన కలిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.