కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలూకురి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుండగా శనివారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో నిర్వహించనున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన మూవీ టీజర్పై మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.