ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ విరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ఫామ్పై ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి అదే ప్లాట్ఫాం మీద ఉన్న ఓ ఆర్మీ డాక్టర్ ప్రాణం పోశారు. పురిటి నొప్పులతో ఆ మహిళ అవస్థ పడుతుంటే రైల్వే స్టేషన్ సిబ్బంది సహకారంతో ఆర్మీ డాక్టర్ పురుడు పోసి మహిళను, బిడ్డను కాపాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.