రాజస్థాన్లోని జైపూర్లో నిర్జల ఏకాదశి రోజున మద్యం పంపిణీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వాహనదారులకు ఉచితం మద్యం ఇచ్చే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది హిందువుల మతభావాలను దెబ్బతీసేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, క్షమాపణ చెప్పించిన వీడియోను విడుదల చేశారు.