ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. SRH స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (141) ఔట్ అయ్యారు. PBKS బౌలర్లపై విరుచుకుపడుతూ అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సులతో 141 పరుగులు చేశారు. అర్ష్దీప్ వేసిన 16.2 ఓవర్కు ప్రవీణ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరారు.