ఆంధ్రప్రదేశ్లోని ఉభయగోదావరి జిల్లాలు వరదలు, కరువులతో సతమతమయ్యాయి. 1833లో అనావృష్టితో 2 లక్షల మంది కరువు బారిన, 1839లో ఉప్పెనతో మరింతమంది మృత్యువాత పడ్డారు. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట కట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ ధవళేశ్వరం వద్ద జలాశయం నిర్మించి, కరువు, వరద సమస్యలను తగ్గించారు. బ్రిటిష్ ఆమోదంతో 1846లో పనులు ప్రారంభమయ్యాయి.