ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమేనని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. అడవులు అంతరించిపోతున్నాయి. నదుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. మానవుల అత్యాశ కారణంగా భూమికి అంతా నష్టమే జరుగుతోంది. ఆహార కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. వ్యవసాయంలో యంత్రాలు, పురుగు మందుల వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలా జనాభా పెరుగుదల వల్ల ఎన్నో నష్టాలు తప్పడం లేదు.