భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలో మూడు రోజులపాటు ఏటీఎంలు మూసివేసి ఉంటాయన్న ఫేక్ ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ఏటీఎంలు ఎప్పటిలాగానే పనిచేస్తాయని స్పష్టం చేసింది. అనధికార ప్రకటనలు, మెసేజ్లను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. కాగా భారత్-పాక్ మధ్య దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.