AP: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థినిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గుసిరాజు వంశీ అనే యువకుడికి సదరు బాలికతో స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇటీవల బాలిక కందుకూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక గర్భవతి అని తేలింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.