యూపీలోని నార్హా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక(12)పై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను చంపి గుడిసెలో వేలాడదీశారు. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని భీమ్ ఆర్మీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.