భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన వేళ పాక్ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను ప్రచారం చేయడం ప్రారంభించింది. గుజరాత్లోని పోర్టు, జలంధర్లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలు పాక్ అనుకూల వ్యక్తులు వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. అయితే, PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని తేల్చింది. ఈ క్రమంలో పాక్ నిర్వహిస్తున్న నకిలీ ప్రచారానికి భారత్ దీటైన స్పందన ఇచ్చింది.