భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పంజాబ్లోని బఠిండాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. స్థానికులందరూ ఇళ్లలోనే ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు తాజాగా హెచ్చరించారు. ఇతర భద్రతా చర్యలు కూడా అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.