TG: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంపై నేటి నుంచి అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నారాయణ్పేట(D) మద్దూర్(M) కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును గురువారం ఆయన ప్రారంభించనున్నట్లు తెలిపారు.