అయోధ్య రామాలయానికి అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. గత ఏడాది ఈ మహాసభ 1.75 కిలోల వెండి రామపాదం సమర్పించింది. ఈసారి తమిళనాడులోని అనుప్పర్పాళ్యంలో తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కిరీటం తయారీ ప్రారంభమైంది. భక్తితో రూపొందిస్తున్న ఈ కిరీటం త్వరలో అయోధ్య రామాలయానికి చేరనుంది.