బాబా రామ్దేవ్కు మరో బిగ్ షాక్ తగిలింది. కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు ఆయనకు రూ.50 లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిందే.