బజాజ్ ఆటో తన ప్రసిద్ధ స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ 2025 బజాజ్ డొమినార్ 250, డొమినార్ 400 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త వర్షన్లలో రైడ్-బై-వైర్ టెక్నాలజీ, నాలుగు రైడింగ్ మోడ్లు, LCD డిస్ప్లే, GPS మౌంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. డామినార్ 400 ధర ₹2.38 లక్షలు, డామినార్ 250 ధర ₹1.91 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టూరింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.