భారత్లో పాకిస్తాన్ వస్తువుల అమ్మకంపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ మేరకు ఈ కామర్స్ సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా పలు సంస్థలకు సీసీపీఏ నోటీసులు ఇచ్చింది. భారత చట్టాలను అనుసరించి తక్షణమే..పాక్ వస్తువులను పోర్టల్స్నుంచి తొలగించాలని CCPA ఆదేశాలు జారీ చేసింది.