BJP నేత బండి సంజయ్కి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. 'ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు రాచరికంగా వ్యవహరించడం కేటీఆర్ మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో తాము ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు. చదువుకున్న బండి సంజయ్కు చదువురాదంటూ మాట్లాడినందుకు కేటీఆర్కు ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి?' అని ప్రశ్నించారు.