TG: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు 'దయగల హృదయం కలిగిన దృఢమైన నాయకుడు, గుజరాత్ పురోగతిని రూపొందించడంలో బీజేపీని బలోపేతం చేయడంలో మాజీ సీఎం విజయ్ రూపానీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అంటూ ' బండి సంజయ్ తెలిపారు.