Top 10 viral news 🔥
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన రూపక్ రెడ్డి(26) అమెరికాలో మృతి చెందాడు. హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్న ఆయన ఫ్రైండ్స్తో కలిసి సరదాగా డెలవేర్లోని ఓ సరస్సులో బోటింగ్కు వెళ్లారు. సరస్సు మధ్యలో ఓ రాయిపైకి ఎక్కి ఫోటోలు దిగుతుండగా రూపక్, రాజీవ్ జారిపడ్డారు. తోటి స్నేహితులు రాజీవ్ను కాపాడినా, రూపక్ను రక్షించలేకపోవడంతో చనిపోయాడు. ఎనిమిది నెలల క్రితమే రూపక్ అమెరికా వెళ్లాడు.