ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావాస్కర్ ట్రోఫీ అనంతరం టీమ్ ఇండియాలో భారీ మార్పులు చేపట్టిన బీసీసీఐ, నలుగురు కోచింగ్ సిబ్బందిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఫిట్నెస్ కోచ్ సోహం దేశాయితో పాటు మరొకరిని బీసీసీఐ తప్పించింది. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు కోచింగ్ స్టాఫ్ పునర్వ్యవస్థీకరణ BCCI కీలక నిర్ణయం తీసుకుంది.