బెట్టింగ్ యాప్ వ్యవహారం.. విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి

74చూసినవారు
బెట్టింగ్ యాప్ వ్యవహారం.. విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. టేస్టీ తేజ, కిరణ్‌గౌడ్ విచారణ పూర్తిగా.. విష్ణుప్రియ, రీతూచౌదరిని విచారిస్తున్నారు. హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ విచారణ భయంతో దుబాయ్ వెళ్లిపోయారు. మరికొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుబాటులో లేరు. కాగా, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని పలువురు సినీ తారలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు. అయితే, బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో భారీగా సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు లబ్ధి పొందారని.. ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసుల ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్