మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. మే 30న ప్రపంచ వ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు చెప్పింది. కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.