బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ను సమం చేసి బర్మింగ్హామ్లో తొలి గెలుపు నమోదు చేసింది. ఈ స్టేడియంలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఎనిమిది టెస్టులు ఆడి ఏడింట్లో ఓడి ఒకటిగా డ్రాగా ముగించింది. అది కూడా 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో డ్రా అయింది. మొత్తంగా తొమ్మిదోసారి బర్మింగ్హామ్ వేదికగా గిల్ సేన బోణీ కొట్టింది.