TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్మోడల్ కాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు.. ధరణిలో బీఆర్ఎస్ నేతల భూమి వివరాలు తప్పుగా నమోదైనట్లు వారే చెప్పుకున్నారని, దానిలోని లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారని తెలిపారు. ధరణిలో ప్రజలు అధికారుల వద్దకు వెళ్ళగా.. భూ భారతితో అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు.