హైదరాబాద్లో మంజీరా ప్రాజెక్టు ఫేజ్-2 పరిధిలోని 1500 MM డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు లీకేజీలు అవడంతో GHMC అధికారులు మరమ్మత్తుల పనులు చేపడుతున్నారు. దీంతో 13వ తేదీ ఉ. 6 గం. నుంచి 14వ తేదీ ఉ. 6 గం. వరకు నీటి సరఫరా నిలిపివేశారు. ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, KPHB, మూసాపేట్, నిజాంపేట్, హైదర్నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్, హఫీజ్పేట్, బీరంగూడ, అమీన్పూర్, బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేశారు.