గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లిన 8 మంది మిష్వో నదిలో మునిగి మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.